వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా సినిమాకు ఎదుగుతూ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాయి. 2021 జనవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ సైబరాబాద్ పోలీసుల ప్రశంసలు అందుకున్నారు.
రాజమౌళి, శోభు లాక్ డౌన్ సమయంలో కష్టపడుతున్న పోలీసుల కోసం పోషకాలతో కూడిన 30,000 గోలీసోడా బాటిల్స్ ను అందజేశారు. సైబరాబాద్ పోలీసుల ట్విట్టర్ ఖాతా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన గోలీ సోడా బాటిల్స్ ను అందజేసిన అందజేసిన రాజమౌళి, శోభు యార్లగడ్డకు సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
Thank you @ssrajamouli @Shobu for the expression of support. @cyberabadpolice enjoyed these tasty and nutritious beverages from @GolisodaDrinks. 30000 bottles distributed over 3 weeks time ensuring social distancing and WHO production guidelines. @TelanganaDGP @KTRTRS pic.twitter.com/VmWnRu5ZKc
— Cyberabad police (@cyberabadpolice) May 30, 2020