ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 199 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో 130 కేసులు నమోదు కాగా పొరుగు రాష్ట్రాలకు చెందిన 69 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో 4,659 కరోనా కేసులు నమోదయ్యయి. కేవలం రాష్ట్రానికి చెందిన వారు 3718 మంది కరోనా భారీన పడ్డారు. గడచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా భారీన పడి మృతి చెందగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 75కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1290 యాక్టివ్ కేసులు ఉండగా 2353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: