యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఎంతోమంది షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. కొంత మంది ఇప్పటికీ కూడా సుశాంత్ సింగ్ ఆత్మహత్య నుంచి తేరుకోలేక పోతున్నారు. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ క్రికెటర్ దిగ్విజయ్ సుశాంత్ ఆత్మహత్య పై స్పందిస్తూ భావోద్వేగం అయ్యాడు.
సుశాంత్ క్రికెట్లో ఎంతో ఆసక్తి కనబరిచేవాడు.. సినిమా షూటింగ్ చివరి రోజున సుశాంత్ కి ఒక మాట ఇచ్చాను... నేను నిన్ను మళ్ళీ కలిసేది ఒక స్థాయి క్రికెటర్గా మారిన తర్వాత అంటూ చెప్పాను. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి ఎంపికైనప్పుడే సుశాంత్ ని కలవాలి అనుకున్నా కానీ లాక్ డౌన్ అమలులోకి వచ్చిన కారణంగా కలవలేకపోయాను. ఇప్పుడు కలవాలన్న అతను మాత్రం మన మధ్య లేడు. తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది చివరిసారిగా కలవలేక పోయాననే బాధ నన్ను వేధిస్తోంది అంటూ యువ క్రికెటర్ దిగ్విజయ్ దేశముఖ్ భావోద్వేగం అయ్యాడు. ఇతడు సుశాంత్ సింగ్ తో కలిసి కై పో చె సినిమాలో నటించాడు.