అస్సాం రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 331 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 5,586కు చేరింది. అస్సాం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా 3,300 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 2,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,88,677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి వారం 50,000కు పైగా ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: