గత కొన్ని రోజులుగా సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై ‌సందిగ్ధ‌త నెలకొన్న సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారందరినీ ప్రమోట్ చేస్తూ గతంలోనే కీలక ప్రకటన చేసింది. 12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి 15 తేదీ మ‌ధ్య‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొన్నిరోజుల క్రితం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. 
 
పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తిపై బోర్డు అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంద‌ని సీబీఎస్‌ఈ కౌన్సిల్‌ రూపేశ్‌ కుమార్‌ కోర్టుకు తెలపగా తాజాగా పరీక్షలను రద్దు చేస్తూ సీబీఎస్‌ఈ నుంచి కీలక ప్రకటన వెలువడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: