జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో విషాద ఘటన చోటుచేసుకుంది, పలిమెల మండలం లంకలగడ్డ గ్రామం లో తొలి ఏకాదశి సందర్భంగా సరదాగా గోదావరి నదిలో స్నానానికి వెళ్ళిన నలుగురు యువకులు గల్లంతయ్యారు.
తోట రవీందర్, పతంగి ప్రదీప్, ఆకుల కార్తీక్, మహదేవపూర్ కి చెందిన తుంగల శ్రీశైలం అనే నలుగురు యువకులు గల్లంతయ్యారు.కాగా ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు గజ ఈతగాళ్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.