అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వచ్చి బిహార్​కు ప్రత్యేక హోదాను ప్రకటించరని.. నితీశ్​ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఆర్​జేడీ నేత, మహాకుటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. జేడీయూ- బిజేపి కలిసి బిహార్​ ప్రజలను వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు.బిహార్​ ఎన్నికలకు మహాకూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు తేజస్వీ. ఈ సందర్భంగా.. బిహార్​లో ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏ పాలనపై విమర్శలు గుప్పించారు​.



తనను తాను ఓ స్వచ్ఛమైన బిహారీగా అభివర్ణించుకున్నారు తేజస్వీ యాదవ్​. నవరాత్రి ప్రారంభమైన రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తేజస్వీ యాదవ్​ వెల్లడించారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: