కేంద్ర ప్రభుత్వంపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ. తమ స్నేహితుల జేబులు నింపటంలోనే
నరేంద్ర మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. అందువల్లనే దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు.ప్రపంచ హంగర్ ఇండెక్స్-2020లో భారత్ మొత్తం 107 దేశాల జాబితాలో 94వ స్థానం రావటంపై ఈ మేరకు విమర్శలు చేశారు రాహుల్.
తన ట్వీట్తో పాటు పాకిస్థాన్(88), నేపాల్(73), బంగ్లాదేశ్(75)తో సహా పొరుగు దేశాల కంటే తక్కువ ర్యాంకును
భారత్ పొందినట్లు చూచించే గ్రాఫ్ను ట్యాగ్ చేశారు రాహుల్.హంగర్ ఇండెక్స్-2020 డేటా ప్రకారం..
భారత్ తర్వాత 13 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ర్వాండా(97), నైజీరియా(98), అఫ్గానిస్థాన్(99),
లిబియా (102), మోజాంబిక్(103), చాద్(107) వంటి దేశాలు ఉన్నాయి.