' గ్రాండ్​ ఛాలెంజెస్' వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇవ్వనున్నారు. అక్టోబర్​ 19 నుంచి 21 వరకు జరిగే ఈ సదస్సును కరోనా నేపథ్యంలో వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తారు.అంతర్జాతీయ ఆవిష్కరణలతో ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు.. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం గత 15ఏళ్లుగా సహకారం అందిస్తోందని ప్రధాని కార్యాలయం తెలిపింది.


 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో.. విధానకర్తలు, శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కానున్నారు.ఈ వార్షిక సమావేశాన్ని బిల్​ అండ్ మెలిండా గేట్స్​ ఫౌండేషన్​, శాస్త్ర సాంకేతిక శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్​, గ్రాండ్ ఛాలెంజెస్ కెనడా, యునైటెడ్​ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్​మెంట్ అండ్ వెల్​కం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: