అయోధ్య రామమందిరం కంటే పెద్దగా బిహార్​ సీతామఢీలో సీత విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్​ చేశారు ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​. సీతారాములు ఒకరు లేకపోతే మరొకరు అసంపూర్ణమేనని.. కాబట్టి సీతామఢీని కలిపేలా అయోధ్య నుంచి ఓ కారిడార్​ను​ నిర్మించాలని కోరారు.విజయదశమి రోజున సీతామఢీలోని పునౌరా ధామ్​ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు చిరాగ్.


 బిహార్​ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు 3 రోజుల ముందు ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్​డీఏలోని జనతా దళ్​ (యునైటెడ్​)ను వ్యతిరేకిస్తూ ఎల్​జేపీ.. ఇటీవలే కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పటినుంచి జేడీయూ అధినేత​, ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ లక్ష్యంగా పాసవాన్​ విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: