చైనా, పాకిస్థాన్​తో యుద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్టు చెప్పారు యూపీ బిజేపి అధ్యక్షుడు స్వతంత్ర దేవ్​ సింగ్. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన అలా అనడం చర్చనీయాంశమైంది.బల్లియాలోని బిజేపి ఎమ్మెల్యే సంజయ్​ యాదవ్​ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వతంత్ర దేవ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.


 సమాజ్​వాదీ పార్టీ, బహుజన సమాజ్​ పార్టీ నేతలను ఉగ్రవాదులతో పోల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.అయితే ఈ వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ రవీంద్ర కుమార్ స్పందిస్తూ... స్వతంత్ర దేవ్​ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు మాత్రమే చేసినవని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: