సోమవారం బిజేపి ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జేడీయూ నేతలు కలిసి ఔరంగాబాద్, పుర్ణియా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ముజాఫర్పుర్లోని సక్రా, మహువా ప్రాంతాలు సహా వైశాలీ జిల్లా మహానర్ నియోజకవర్గంలోని జందహాలో ర్యాలీలు చేపట్టారు.తేజస్వీ యాదవ్ సమస్తిపుర్ జిల్లాలోని హసన్పుర్లో ప్రచారం నిర్వహించారు. తన అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జేడీయూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్కుమార్ బలమైన అభ్యర్థిగా తేజ్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. రాఘోపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనతో ప్రచారం ముగించారు తేజస్వీ.
సోమవారం బిజేపి ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జేడీయూ నేతలు కలిసి ఔరంగాబాద్, పుర్ణియా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ముజాఫర్పుర్లోని సక్రా, మహువా ప్రాంతాలు సహా వైశాలీ జిల్లా మహానర్ నియోజకవర్గంలోని జందహాలో ర్యాలీలు చేపట్టారు.తేజస్వీ యాదవ్ సమస్తిపుర్ జిల్లాలోని హసన్పుర్లో ప్రచారం నిర్వహించారు. తన అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జేడీయూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్కుమార్ బలమైన అభ్యర్థిగా తేజ్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. రాఘోపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనతో ప్రచారం ముగించారు తేజస్వీ.