బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్​ పోలింగ్​ ఈ నెల 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో మొదటి దఫా పోలింగ్​ జరిగే 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి ఫేజ్​లో ఆర్​జేడీ అత్యధికంగా 42 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.


సోమవారం బిజేపి ప్రెసిడెంట్​ జేపీ నడ్డా, జేడీయూ నేతలు కలిసి ఔరంగాబాద్​, పుర్ణియా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ ముజాఫర్​పుర్​లోని సక్రా, మహువా ప్రాంతాలు సహా వైశాలీ జిల్లా మహానర్​ నియోజకవర్గంలోని జందహాలో ర్యాలీలు చేపట్టారు.తేజస్వీ యాదవ్ సమస్తిపుర్​ జిల్లాలోని​ హసన్​పుర్​లో ప్రచారం నిర్వహించారు. తన అన్న తేజ్​ ప్రతాప్​ యాదవ్​ ఇదే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జేడీయూ సిట్టింగ్​ ఎమ్మెల్యే రాజ్​కుమార్​ బలమైన అభ్యర్థిగా తేజ్​తో అమీతుమీ తేల్చుకోనున్నారు. రాఘోపుర్​ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనతో ప్రచారం ముగించారు తేజస్వీ.

మరింత సమాచారం తెలుసుకోండి: