బిహార్​ ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. కరోనా సంక్షోభంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల బిహార్​వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. 2.14కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.


కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్​ కేంద్రాల శానిటైజేషన్​ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.బిహార్​లో తొలి విడత ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంగెర్​, లాఖిసరాయ్​, గయా సహా అన్ని పోలింగ్​ కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: