బిహార్​లో విద్య, వైద్య వ్యవస్థను నితీశ్​ కుమార్​ ప్రభుత్వం నాశనం చేసిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ చేసిన వ్యాఖ్యలపై బిజేపి అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్​ స్పందించారు. లాలూ కుటుంబంపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు​. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఇద్దరు మాజీ సీఎంల కుమారులు పదో తరగతి పాస్​ అవడంలో సహకరిస్తామని అన్నారు.


తేజస్వీ, తేజ్​ ప్రతాప్​ తల్లిదండ్రులు లాలూ యాదవ్​, రబ్రి దేవీ.. గతంలో బిహార్​ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్​ 28న తొలిదశ పోలింగ్​ ముగిసింది. మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొదటి దఫాలో మొత్తం 71 స్థానాలకు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. నవంబర్​ 3న రెండోదశ, నవంబర్​ 7న మూడోదశ పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: