చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియాలతో కలిసి 'మలబార్​' నౌకాదళ విన్యాసాలు చేయనుంది భారత్. నవంబర్​ 3 నుంచి 6 వరకు విశాఖపట్నం తీరంలో బంగాళఖాతంలో తొలివిడత విన్యాసాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో నవంబర్​ 17 నుంచి 20 వరకు రెండో దశ మెగా విన్యాసాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు షెడ్యూల్​ విడుదల చేశారు.మొదటి దశ విన్యాసాల్లో భాగంగా.. క్రాస్​-డెక్​ ఫ్లయింగ్, సీమ్యాన్ షిప్​ వాల్యూషన్స్​, ఆయుధ కాల్పుల విన్యాసాలతో పాటు ఉపరితలం, జలాంతర్గామి, యాంటీ-ఎయిర్​ వార్ఫేర్​ ఆపరేషన్లు ప్రదర్శించనున్నట్టు అధికారులు తెలిపారు.

 సంక్లిష్టమైన అధునాతన నౌకాదళ ప్రదర్శనలు జరుగనున్నట్లు సమాచారం.మలబార్ 2020 పేరిట జరిగే ఈ మెగా విన్యాసాల్లో తొలుత భారత్‌- అమెరికా- జపాన్​లు మాత్రమే భాగస్వాములయ్యాయి. అయితే.. చతుర్భుజ కూటమిలో భాగస్వామి అయిన ఆస్ట్రేలియానూ కలుపుకోవాలని ఆ దేశం విజ్ఞప్తి చేయడం వల్ల.. దానికి అంగీకరించింది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: