తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో హైదరబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మరణాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో 35 మంది కరోనా పేషెంట్స్ మరణించినట్లు సమాచారం. మృతులలో 16 మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నారని తెలుస్తుంది. అయితే మరణాలు ఈ స్థాయిలో పెరుగుతున్న వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే బాధితులు వ్యాది ముదిరిన తరువాత వైద్యం కోసం వస్తున్నారని, అందువల్లే మరణాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఉన్న వెంటనే ఆసుపత్రికి తప్పని సరిగా రావాలని వైద్యులు సూచించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: