ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ వేదికలు ఖరారయ్యాయి. ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాల్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నాయి. మరో వైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా అవాంతరాలు తొలగిపోయాయి. వరల్డ్కప్లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్తాన్ జట్టుకు ఎటువంటి వీసా సమస్యలు ఉండవని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. పాకిస్తాన్ ఆటగాళ్లు వీసా ఇచ్చే అంశంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు జే షా తెలియజేశారు. ఆటగాళ్లకు వీసాలిచ్చినా.. ప్రేక్షకులకు వీసాలు ఇవ్వాలా? వ?ద్దా అన్న అంశాన్ని ఇంకా తేల్చలేదన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోవడంతో ఈ రెండు దేశాల మధ్య ఏడు సంవత్సరాల నుంచి ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగడంలేదు.
ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ వేదికలు ఖరారయ్యాయి. ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాల్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నాయి. మరో వైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా అవాంతరాలు తొలగిపోయాయి. వరల్డ్కప్లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్తాన్ జట్టుకు ఎటువంటి వీసా సమస్యలు ఉండవని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. పాకిస్తాన్ ఆటగాళ్లు వీసా ఇచ్చే అంశంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు జే షా తెలియజేశారు. ఆటగాళ్లకు వీసాలిచ్చినా.. ప్రేక్షకులకు వీసాలు ఇవ్వాలా? వ?ద్దా అన్న అంశాన్ని ఇంకా తేల్చలేదన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోవడంతో ఈ రెండు దేశాల మధ్య ఏడు సంవత్సరాల నుంచి ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగడంలేదు.