కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయినా ఈ మహమ్మారి శాంతించిన్నట్లు కనిపించడంలేదు. రోజు రోజు స్పీడ్ పెంచుతుంది. పాజిటివ్ కేసులతో పాటు అటు మరణాల సంఖ్య కూడా అందరిని కలవరపెడుతుంది. ఇక ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ మహమ్మారి కరోనా బారిన పడగా..తాజాగా ‘దిల్ పే మత్ లే యార్’, ‘సిటీలైట్స్’, ‘సిమ్రాన్’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్ 1992’ (వెబ్ సిరీస్) తీసిన దర్శకుడు హన్సల్ మెహతా ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. దర్శకుడు హన్సల్ మెహతాతో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది.అయితే ఇప్పుడు అందరు కోలుకుంటున్నారు. " మేం సేఫ్గా ఉన్నాం. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్ వేయించుకోండి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించండి"అంటూ ఆయన పేర్కొన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: