క‌రోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం బుధవారం నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ముందు నిశ్చయించుకున్న ముహుర్తం ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో లాక్ డౌన్ సందర్భంగా ఓ పెళ్ళికొడుకు ఆటోలో బయలుదేరి పెళ్లికి వెళ్ళాడు. స్థానిక పోలీసులు ఆటోను ఆపి అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దాంతో ఆ యువకుడు స్థానిక అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వారికి చూపించి పెళ్లికి బయల్దేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: