పశ్చిమ బెంగాల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు 77 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 75కు తగ్గింది. ఆ ఇద్దరు కూడా బిజెపి ఎంపిలు కావడం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నితీష్‌ ప్రమాణిక్‌, జగన్నాధ్‌ సర్కార్‌ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖలనిచ్చారు.  బెంగాల్‌లో ఫలితాలు ఆశించిన విధంగా లేవని, ప్రభుత్వ ఏర్పాటు చేసి ఉంటే..తమకు కీలక పదవులు దక్కేవని జగన్నాథ్‌ సర్కార్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP