కమెడీయన్‌ గౌతం రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సిద్ధార్థ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనాకి గురైన ఆయన కాకినాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గౌతంరాజు సోదరుడి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తన సోదరుడు మరణ వార్తని గౌతంరాజు తెలియజేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. బయట పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని, అందరు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: