క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవాంల‌టే ప్ర‌జ‌లు జంకుతున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని వ్యాక్సిన్ లు తీసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. అయితే తాజాగా 124 ఏళ్ల బామ్మ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ తీసుకుంది. అంతే కాకుండా ప్ర‌పంచంలో వ్యాక్సిన్ తీసుకున్న అత్య‌ధిక వ‌య‌సు క‌లిగిన బామ్మ‌గా నిలిచిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల బామ్మ‌కు డాక్ట‌ర్లు కొవిడ్ -19 వ్యాక్సిన్‌ అందించారు. డోర్ టూ డోర్ వ్యాక్సినేష‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆమెకు వ్యాక్సిన్ వేసిన‌ట్టు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. వాక్సిన్ వేసిన త‌ర‌వాత బామ్మ చాలా ఆరోగ్యంగా ఉంద‌ని ఎలాంటి స‌మ‌స్య లేద‌ని పిహెచ్‌సి శ్రాక్వర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తాజముల్ మాలిక్ చెప్పారు. ఇదిలా ఉండ‌గా 118 ఏళ్ల జ‌ప‌నీస్ మ‌హిళ వ్యాక్సిన్ తీసుకున్న అత్య‌ధిక వ‌య‌స్సు క‌లిగిన మ‌హిళ‌గా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. ఇప్ప‌డు కాశ్మీర్ బామ్మ వ‌య‌సు 124 ఏళ్లు అయినప్ప‌టికీ వ‌య‌సుకు సంబంధించి ఎలాంటి రుజువు లేనందున అధికారులు ధృవీకంరించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: