మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈనెల 14న కషాయం కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దాంతో ఈరోజు అధికారికంగా ఈటల తన రాజీనామా సమర్పించి పార్టీకి పదవికి గుడ్ బై చెప్పనున్నారు.

ఉదయం శామీర్ పేట్ లోని తన అధికారిక నివాసం నుండి ఈటల అభిమానులు, అనుచరులతో కలిసి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళు అర్పిస్తారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. కరోనా నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కలవకుండా అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పాత్రాన్ని ఇవ్వనున్నారు. ఇక పార్టీ రాజీనామా  పత్రాన్ని ఈటల ఈమెయిల్ ద్వారా పంపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: