షర్మిల హుజూర్ నగర్ పర్యటన విషయంలో ఊహించని షాక్ తగిలింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మేడారం గ్రామంలో నిరుద్యోగ యువకుడు నీలకంఠ సాయి కుటుంబాన్ని పరామర్శించి అక్కడే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించాలని షర్మిల భావించారు.. అయితే అనూహ్యంగా మేడారం గ్రామంలో నీలకంఠ సాయి కుటుంబ సభ్యులు మొత్తం ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళి పోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. 

అయితే షర్మిల వస్తుంది కాబట్టే కావాలని నీలకంఠ కుటుంబాన్ని టిఆర్ఎస్ నేతలు తరలించాలని షర్మిల పార్టీ నేత పిట్ట రామ్ రెడ్డి ఆరోపించారు నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: