కరోనా నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్ అని ప్రభుత్వాలు ముందు నుంచి ఊదర గొడుతూనే ఉన్నాయి. అయినా సరే వాక్సినేషన్ వేయించుకోవడానికి ప్రజలు ముందు అంత ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వాక్సినేషన్ కేంద్రాలకు పరుగులు పెడుతూ ఉండడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ప్రజలు వెనకాడుతూనే ఉన్నారు. 


ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించి, వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అందరూ భావించడం కోసం తమిళనాడులోని మధురైలో ఉన్న ఒక సెలూన్  బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటి అంటే covid 19 వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ తో వచ్చిన అందరు కస్టమర్లకు 50% డిస్కౌంట్ అందిస్తోంది సదరు సెలూన్. సెలూన్ యజమాని కార్తికేయన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి అవగాహన పెంచడానికి మేము ఈ 50 శాతం ఆఫర్ ఇస్తున్నామని, మూడవ దశ రాకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: