మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల తర్వాత దళిత దండు ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ దొర మనస్తత్వం దళితుల మ‌న‌స్త‌త్వానికి పొస‌గ‌దు అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత పథకాలు పెట్టి రాజకీయ నాయకులను ప్రలోభ పెట్టి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడం కెసిఆర్ తత్వం అని అన్నారు.

అసెంబ్లీ ఎన్ని క‌ల వాగ్దానం ప్ర‌కారం కేసీఆర్ ద‌లితుల‌కు 3 ఎక‌రాల భూమికి స‌మాన‌మైన రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని అన్నారు. కోకా పేట‌ భూముల వ్యవహారం అనేది ఒక భూ కుంబ‌కోణం అని వ్యాఖ్యానించారు.  టెండ‌ర్లను నిర్వహించిన సంస్థ సభ్యులు అందరూ కూడా కేసుల్లో ఉన్న వారే అని అన్నారు. కోకాపేట‌ గ్లోబల్ అటెండర్ అయితే కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నవారు ఎలా పాల్గొంటారని అన్నారు. దేశంలోని ఎవరూ వేలంలో పాల్గొన‌కుండా బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: