టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద కాసేపటి క్రితం దాడి జరిగింది. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవినేని ఉమా పై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో దేవినేని ఉమా కు గాయాలయ్యాయి లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. 


గడ్డ మణుగూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ దాడిలో ఎంత మందికి గాయాలయ్యాయి ? ఏంటి ? అనే దానిపై స్పష్టత లేకపోయినా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ దాడిలో ఉమా అనుచరులు కొంత మందికి గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. దేవినేని ఉమ తో పాటు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: