ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. సాహో సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది రిలీజ్ కావాల్సిన సినిమా... వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా గురించి సినిమా డైరెక్టర్గుడ్ న్యూస్ చెప్పారు. సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ పూర్తి అయిపోయిందన్న దర్శకుడు రాధా కృష్ణ కుమార్.... ఫ్యాన్స్ కోసం ఓ గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మరో మూడు రోజుల్లో రాధే శ్యామ్ గురించి అధికారిక అప్ డేట్ వస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఆతృత ఎక్కువైంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని కొందరు.... లేదు సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారని మరి కొందరు ట్రోల్ చేస్తున్నారు. బాహుబలితో హాలీవుడ్ స్థాయికి వెళ్లిన డార్లింగ ప్రభాస్... సాహోతో బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించారు. ఇప్పుడు రాధే శ్యామ్ తో ఏం చేస్తారనేది తెలియాలంటే... మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: