పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా మత్స్యశాఖలొ భారీ కుంభకోణం సంచలనంగా మారింది. ఏడు కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిన ఇంటి దొంగల దెబ్బకు ప్రభుత్వం కూడా ఉలిక్కి పడింది. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసిన కొందరు ఉద్యోగుల వ్యవహారం ఇది. గత ఏడాది కరోనాతో మృతి చెందిన ఒక ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శాఖా పరమైన ఆడిట్ చేస్తుండగా బయటపడిన స్కామ్  దెబ్బకు ప్రభుత్వ కీలక అధికారులు కూడా షాక్ అయ్యారు. దీని మీద ఇప్పటికే పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు రాకుండా జాగ్రత్తగా విచారణ చేపట్టారు. దీనిట్లో ఎవరిది అయినా రాజకీయ నాయకుల హస్తం ఉందా అనే దానిపై ఇప్పుడు విచారణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: