ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరున్న  సజ్జనార్‌ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న  సంగతి తెలిసిందే. ఖాకీ డ్రస్సులో దుమ్ము రేపే సజ్జనార్‌ వైట్ కాలర్‌ పోస్టులోనూ తన మార్కు చూపిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.


ఆయన తాజాగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డిపోను సందర్శించారు. అక్కడి డిపో, గ్యారేజ్, బస్టాండ్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పరిశీలించారు. ఆర్టీసీ సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్ నుంచి సదాశివపేటకు ఆర్టీసీ బస్సులో వెళ్లిన సజ్జనార్‌.. ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని అదనపు బస్సులు నడుపుతామన్న సజ్జనార్‌.. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని తెలిపిన సజ్జనార్.. ఆర్టీసీ సిబ్బంది అంతా రెండు డోసుల టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అధికారులు, సిబ్బంది అంతా కలిసి అంకితభావంతో పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: