తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్‌ తెలిపింది. తెలంగాణలో గురుకుల విద్యాలయాలకు ఉన్న డిమాండ్‌ తెలిసిందే. అన్నీ ఉచితంగా అందిస్తూ ఉత్తమ విద్యను అందిస్తున్న పాఠశాలలుగా వీటికి పేరుంది. ఈ పాఠశాలల్లో సీట్లు కావాలని ఎమ్మెల్యేలను సైతం రికమెండేషన్ల కోసం ఒత్తిడి చేస్తుంటారు.

ఇప్పుడు తెలంగాణ సర్కారు ఈ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచుతోంది. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మరో  33 బీసీ గురుకుల పాఠశాలలు, మరో 15 బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలు ఏర్పడబోతున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: