నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ తో కేవలం ఉగ్రవాదంపైన మాత్రమే చర్చలు జరుపుతామని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. లేకపోతే పాకిస్తాన్ కచ్చితంగా అంతం అవుతుందని మోదీ హెచ్చరించారు. ఇప్పటికే భారత్ అంటే ఏంటో పాక్ కి చూపించామని అన్నారు. నీళ్లు.. రక్తం ఒకే మార్గంలో ప్రవహించవని మోదీ స్పష్టం చేశారు.

పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో పీఓకేలో ఉగ్ర‌శిభిరాల‌పై భారత్ మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ తో పాటుగా 20కి పైగా ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహించింది.

భారతదేశంలోని జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిపింది. దీంతో భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెట్టింది. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేసింది. భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ అన్నీ విధాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పాకిస్థాన్ ఎన్నో విధాలుగా భారత్ ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: