భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నెట్వర్క్ను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 4జీ సేవలు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాలలో 4జీ సేవలను అందించనున్నట్లు ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
ఈ మధ్యే బీఎస్ఎన్ఎల్ కర్ణాటకలోని శివమొగ్గ సిటీలో 4జీ మొబైల్ టవర్ను ఏర్పాటు చేసి 4జీ సేవలను పరీక్షించింది. అంతకు ముందు కేరళలో ఇడుక్కి జిల్లాలో 2100 మెగాహెడ్జ్ బ్యాండ్లో 4జీ సేవలు పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది.
వినియోగదారులు తమ 2జీ, 3జీ సిమ్ కార్డులను రూ.20 నామమాత్రపు చార్జితో 4జీ సిమ్ గా అప్గ్రేడ్ చేసుకోవలసి ఉంటుంది.ఇక 4జీ వాడాలనుకునే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ సిమ్లను 4జీ సిమ్కు అప్గ్రేడ్ చేసుకోవాలి. అందుకు రూ.20 నామమాత్రపు చార్జి అవుతుంది.