అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపద్దాయ్. ఎప్పుడు తెరుచుకుంటాయి ఎప్పుడు మూత పడతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితి సద్దుమణుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక అన్ని రకాల విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అన్ని కళాశాలల్లో లెక్చరర్ కొరత ఏర్పడుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొన్ని విద్యాసంస్థలు వినూత్నమైన ప్లాన్ అమలులోకి తీసుకు వస్తున్నాయ్. ఈ విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అలాంటి వారిని గుర్తించి రప్పించే పనిలో పడ్డారట. కొన్ని కళాశాల యాజమాన్యాలు అయితే ఏకంగా ఈ పని ఏజెన్సీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక రోజూ ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేసి వెళితే నెలకి 15000 రూపాయలు ఇస్తామని కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఒప్పందం కూడా కుదుర్చుకుంటు ఉన్నాయట. ఈ క్రమంలోనే బాచుపల్లిలోని ఒక కళాశాల జెఎన్టియు పరిధిలోని ఒక కళాశాలల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయట. కాగా జేఎన్టీయూహెచ్ తనిఖీలను వస్తే దాదాపు 20వేల రూపాయలు ముట్టచెబుతామని కన్సల్టెన్సీ ఏజెన్సీలు బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.