సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళదాక అందరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల అరాచకాలను అరికట్టలేకపోతున్నారు. ఏపీలో కామాంధులు రెచ్చిపోయారు. సరదా గడిపేందుకు బీచ్‌కు వచ్చిన యువతిపై ముగ్గురు దుర్మార్గులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు, ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ పాల్పడుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చింది. ఆమెపై కన్నేసిన మద్యం మత్తులో ముగ్గురు కీచకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఈ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లింది.

అయితే మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చారు. ఇక స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. అక్కడి నుంచి తప్పించుకున్న జంట ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు

ఇక ఇది ఇలావుంటే పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి యువతి సెల్‌ఫోన్ సేకరించి కాల్ చేయడం మొదలు పెట్టాడు. మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు బంధువులకు జరిగిన అసలు విషయం చెప్పడంతో వారు బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: