హైదరాబాద్ మహానగరం లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా చాలా కాలకం రేపుతోంది. ఉన్న ప లంగా .. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ వ్యక్తి దారుణ హత్య జరుగడం స్థానికంగా ఉన్న ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోందన్న మాట.  మద్యం మత్తులో డబ్బుల విషయం లో గొడవ పడి సోను అనే యువకుడి నీ  అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు మనకు సమాచారం అందుతోంది.  ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సోను ( 27 ) బతుకు తెరువు కోసం ఆరు సంవత్సరాల క్రితం నగరాని కి వచ్చి  హైదరాబాద్ మహానగరం లోని ముషిరాబాద్ లో స్థిరపడ్డాడని సమాచారం అవుతోంది.  

సోను ముషీరాబాద్  భరత్ నగర్ కు చెందిన బ్రహ్మచారి అనే వ్యక్తి వద్ద కార్పెంటర్ పని చేస్తున్నాడని సమాచారం అందుతోంది.  ముషీరాబాద్ లో మటన్ షాప్ లో పనిచేసే అల్తాఫ్ ఖాన్ యువకుని తో కలిసి ముషీరాబాద్ లో ఒకే రూమ్ లో కలిసి నివాసం ఉంటున్నారని పోలీసుల దర్యాప్తు లో తేలినట్లు మనకు అర్హం అవుతోంది.  ఇద్దరు కలిసి  శుక్రవారం రాత్రి రూమ్ లో మద్యం సేవించారని సమాచారం.   మద్యం మత్తు లో ఇద్దరి మధ్య డబ్బుల కోసం గొడవ జరిగిందని.. అల్తాఫ్ ఖాన్ కత్తి తో సోను గొంతు కోసి హత్య చేశాడని పోలీసుల దర్యాప్తు లో తేలినట్లు మనకు అర్థం అవుతోంది.  

హత్య చేసిన అనంతరం అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్ పోలీసులకు లొంగి పోయినట్లు కూడా మనకు  సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం తెలియగానే  సంఘటనా స్థలానికి చేరు కున్నారు  చిక్కడపల్లి ఏసిపి శ్రీధర్ ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్. మొదట  దారుణ హత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఈ  దారుణ హత్య కేసు ను పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఈ సంఘటనలో హత్య జరిగిందా ? లేదా ? సూసైడ్ చేసుకున్నాడా ? అనే కోణం లోనూ పోలీసులు విచారణ చేస్తున్నామని చెబుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: