పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా జాలి దయ చూపించడం లేదు మనుషులు. ఇక మనుషులు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి గల కారణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ నరహంతకుడుగా మారిపోయాడు. చిన్న కారణానికి ఏకంగా కోడలిని దారుణంగా తుపాకీతో కాల్చాడూ. ఈ ఘటనతో స్థానికంగా అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఉదయం టీ తో పాటు బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు అనే కారణం తో కోడలిపై కాల్పులు జరిపాడు మామ. రాజస్థాన్లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన కాశీనాథ్ పాండు రంగ పాటిల్ అనే 76 ఏళ్ల వ్యక్తి బ్రేక్ఫాస్ట్ పెట్టలేదని టి ఇవ్వ లేదనే కోపం తో తుపాకితో కాల్పులు జరుపగా కడుపు లో బుల్లెట్లు దూసుకెళ్లడం తో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలా చిన్న కారణానికి కాల్పులు జరగడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం పై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ప్రస్తుతం బాధితురాలు చికిత్స తీసుకుంటుంది అనేది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి