ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరో కాదు ఏకంగా నా భర్తను హత్య చేశారు అంటూ బోరున విలపించిన భార్య అన్న విషయం తేలింది. మృతుడి భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజధానిలోని ఆగ్నేయ జిల్లాలో భర్తను హత్య చేసిన కేసులో స్వర్ణలి ఘోష్ అనే మహిళను అరెస్టు చేశారు. కల్కాజీలోని ఓ ఇంట్లో అపస్మారకస్థితిలో పడివున్న వ్యక్తికి సంబంధించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మెడపై కత్తి తో మంచం పై తలకిందులుగా ఉండే పడి ఉన్న వ్యక్తిని గుర్తించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని తమదైన శైలిలో విచారణ జరపడం మొదలుపెట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ను పరిశీలించారు. తన భర్తను ఎవరో చంపారని.. భర్త లేకుండా ఎలా బ్రతకాలి.. నా జీవితం మొత్తం నాశనం అయ్యింది.. ఓ దేవుడా ఇలా ఎందుకు చేశావు అంటూ బోరున ఏడ్చేసింది భార్య. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరికి నేరాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఇక సదరు మహిళ తో పాటు ప్రియుని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.