మనిషి జీవితం గ్యారెంటీ లేనిది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలను చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరి లో కలుగుతుంది. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ఎంతోమందిని మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. వెరసి అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో అరణ్య రోదన మిగిలిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు రోడ్డు ప్రమాదాలు,సడెన్ హార్ట్ ఎటాక్లు మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇక ఇవేవీ చాలవు అన్నట్లు అటు కొన్ని కొన్ని సార్లు బతకడానికి తిన్న ఆహారం కూడా ప్రాణాలు తీసేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఫుడ్ పాయిజన్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఎంతో ఇష్టంగా మటన్ కూర తెచ్చుకొనితినడమే వారి పాలిట శాపంగా మారిపోయింది. చివరికి కుటుంబంలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.


 ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అరకు గన్నెల గ్రామంలో ఈ ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి. మేక మాంసం తెచ్చుకుని ఎంతో ఇష్టంగా వండుకొని తిన్న తర్వాత ఓకే కుటుంబంలోని తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మీనాక్షి మృతి చెందింది. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: