
కానీ పాక్ చైనాకు దగ్గర అవుతుండటంతో భారత్ తో అమెరికా స్నేహ హస్తం చాటుతోంది. తవాంగ్ ఘటనకు సంబంధించి మొదటి సారి అమెరికా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో 2022 సంవత్సరం డిసెంబర్ 9 న ఘర్షణ నెలకొంది. చైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు సిద్దపడుతోందని భారత్ కు సమాచారాన్ని అమెరికా చేరవేసినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు మాత్రం అమెరికా వెనకాడుతోంది. అమెరికా చెప్పిన వెంటనే భారత బలగాలు అక్కడకు చేరుకుని చైనా తవాంగ్ సెక్టార్ ను ఆక్రమించుకోకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
చైనాతో భారత్ ఎలాగో విభేదాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా మద్దతు ఇస్తుంది. ఈ ప్రాంతంలో చైనా ను నిలువరించాలంటే భారత్ తో మాత్రమే సాధ్యమవుతుందని చాలా లేట్ గా అమెరికా తెలుసుకున్నట్లు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో చైనా చేస్తున్న దుందుడుకు చర్యలను తిప్పి కొట్టాలంటే భారత్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఈ విధంగానైనా భారత్ కు అమెరికా దగ్గరైతే కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.