అయితే ఈ దాడి విషయంలో తెలుగు దేశం నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఒక రాష్ట్ర సీఎంపై దాడి జరిగిన సమయంలో దానిని ఖండించాల్సింది పోయి.. కోడి కత్తి డ్రామా 2.0, ఎన్నికల వేళ మరో జిమ్మిక్కు వంటి అంశాలను ప్రస్తావిస్తూ దీనిని అపహాస్యం చేస్తున్నారు. రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు తప్పనిసరి. అయితే ప్రత్యర్థి కష్టకాలంలో ఉన్న సమయంలో ఓదార్చాల్సింది పోయి.. రాజకీయాలే ముఖ్యమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనపై తిరుపతిలో దాడి జరిగితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెళ్లి పరామర్శించి.. సంఘీభావంగా నిరసన దీక్ష చేపట్టారు. కానీ నేడు టీడీపీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత జగుప్సాకరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వీరిని నిలువరించే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయలేదు.
మరోవైపు నారా లోకేశ్ ఒక సెటైరికల్ గా, పద్యరూపంలో జగన్ ని విమర్శిస్తూ పోస్టు