చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను యజ్ఞంగా చేపడుతున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క కొనియాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణం జరుగుతోంది. శిల్పాలు, స్తంభాలపై చెక్కిన డిజైన్లు గిరిజనుల జీవన విధానం, ఆచారాలు, పూజా విధానాలను సూచిస్తాయి. ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించి, శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. ఈ పనులు రెండు వందల ఏళ్లు నిలిచేలా ఉంటాయని మంత్రులు తెలిపారు. మేడారం ఆలయ పరిసరాల్లో విశాలమైన రోడ్లు సిద్ధమవుతున్నాయి, గతంలో 50 నుంచి 60 అడుగులు ఉన్న రోడ్లు ఇప్పుడు 100 నుంచి 120 అడుగుల వరకు విస్తరిస్తున్నాయి.
మంత్రి సీతక్క ఆదివాసీ విశ్వాసాలకు అనుగుణంగా ఆలయం రూపొందుతోందని పేర్కొన్నారు. జాతర విజయవంతం కావాలని కృషి చేస్తున్నామని, ఈసారి ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మన ఇంటి దేవతల జాతరకు అందరూ ఒక్కటై వచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతరకు రెండు కోట్లకు పైగా భక్తులు రావొచ్చని అంచనా. గిరిజనుల ధైర్యసాహసాలను స్మరించుకునే ఈ జాతర ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి