బీటెక్ పాసై.. ఉద్యోగాలు లేక కష్టాలు ఎదుర్కొంటున్నవారికి శుభవార్త. ఇటీవ‌ల‌ విస్తరిస్తున్న కొత్త రంగాలు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 259 ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

 

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ ఓపెన్ చేసి చూడొచ్చు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు మార్చి 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 17 చివరి తేదీ. 

 

విద్యార్హత.. సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ అవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది. జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ ఉండాలి.

 

పోస్టుల వివ‌రాలు చూస్తే..
మొత్తం ఖాళీలు- 259
మెకానికల్- 125సివిల్- 5కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15
కంప్యూటర్- 5
హ్యూమన్ రీసోర్స్- 10

 

ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65
ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10
మైనింగ్- 5
జియాలజీ- 5
ఫైనాన్స్- 14

మరింత సమాచారం తెలుసుకోండి: