నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక శుభవార్త లాంటిది. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc ) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేవలం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది..
మార్చి 21వ తేదీ ని చివరి తేదీగా ప్రకటించారు.


అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ అధికార http://ssc.nic. in/ వెబ్సైట్ లో చూడవచ్చు. గతంలో  మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్ ) స్టాఫ్ (Mts) నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టులను భర్తీ చేసింది. ఈసారి కూడా దాదాపు అదే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని ముఖ్య సమాచారం.

మొత్తం ఖాళీలు : ఖాళీలకుసంబంధించి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా ( పదోవతరగతి )/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

వయస్సు : వివిధ విభాగాలు అనుసరించి 01.01.2021 నాటికి 18-25 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ /ఎస్టీలకు 5 సంవత్సరాలు,  ఓబీసీలకు 3 సంవత్సరాలు పీ డబ్ల్యు డీ అభ్యర్థులకు 10 సంవత్సరాల గరిష్ట వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ( పేపర్-1, పేపర్-2 ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు: ఫిబ్రవరి 5,2021.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 21, 2021. ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 23,2021.

అంతేకాకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్( టైర్ -1):01.07.2021 నుంచి 20.07.2021 వరకు.

టైర్ -2: మార్చ్ ( డిస్క్రిప్టివ్ పేపర్): నవంబర్ 21 2021. వెబ్సైట్ :http:ssc.nic. in/

మరింత సమాచారం తెలుసుకోండి: