ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుండడంతో ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే కరోనా రాకుండా ఉండేందుకు, మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు చాలామంది వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో చాలా మంది ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడుతున్నట్లు ఈ మధ్య వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది..

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారినపడే అవకాశం ఉంటుందని, చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కేసులు నమోదు అవుతాయి అని తెలిపింది.. కానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వచ్చిన వారు తక్కువగా  అనారోగ్యానికి గురి అవుతున్నారు అని  ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనా సోకినా స్వల్ప మొత్తంలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పింది.

అయితే ఈ కరోనా ను అరికట్టడానికి వాక్సినేషన్ చాలా అవసరం. కానీ కేవలం 0.03% నుండి 0.04 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ బారిన పడుతున్నారని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడ్డ వారు స్వల్ప లక్షణాలతో మాత్రమే భయపడుతున్నారని కేంద్రం చెబుతోంది.. అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకంటే ఈ వాక్సిన్ వైరస్ తీవ్రతను తగ్గించి, తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. కానీ ఈ సమయంలో ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకునప్పటికీ పాజిటివ్ అనే చూపిస్తుంది. కానీ ఇలాంటి వారి వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి అని పీబీ స్పష్టం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: