
లేచిన వెంటనే సోషల్ మీడియా, మెసేజ్లు, ఈమెయిల్స్ చూడడం వల్ల మన మెదడులో ఒత్తిడి మొదలవుతుంది. లేచిన వెంటనే బాయిలెట్కు వెళ్లకపోవడం మూత్రపిండాలపై ఒత్తిడికి దారితీస్తుంది. నిద్రలేవగానే మన శరీరం తాగిన నీరు ఫిల్టర్ చేసి బయటకు పంపడానికి సిద్ధంగా ఉంటుంది. ఆలస్యం చేయకూడదు. చల్లని నీటితో ముఖం కడిగితే నిద్ర మిగిలిపోయే అవకాశం ఉంది. తేలికపాటి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగడం మెరుగైన ప్రక్రియ. నిశ్శబ్దంగా ఉండడం మంచిదే కానీ చాలాసేపు నోరు ఊచకుండానే ఉండడం మానసికంగా బరువుగా మారుతుంది. ఓ మంచి మాట, ప్రార్థన లేదా మంత్రమైనా జపించడం మెదడుకు ఉత్తేజాన్ని ఇస్తుంది.
నిద్ర లేవగానే కడుపు ఖాళీగా ఉంటుంది. వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆమ్లం ఎక్కువగా తయారై గ్యాస్, అసిడిటీని కలిగిస్తుంది. మొదట గోరువెచ్చటి నీరు తాగాలి, ఆ తర్వాత ఆహారానికి వెళ్లాలి. నిద్ర తర్వాత శరీరంలోని కండరాలు బాగా విశ్రమించి ఉంటాయి. కాసేపు చేతులు, కాళ్లు స్ట్రెచ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది ఒత్తిడి లేకుండా రోజును ప్రారంభించేందుకు సహాయపడుతుంది. పడక నుంచి లేచిన వెంటనే కాళ్లపై నిలబడితే వెన్నెముకకు తక్షణ ఒత్తిడి వస్తుంది. మెల్లగా కూర్చోని, 5-10 సెకన్లు ఆగి ఆపై నిలబడాలి.