ప్రాణం ఖరీదు సినిమా ద్వారా టాలీవుడ్ కి యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత పునాది రాళ్లు, మనవూరి పాండవులు, ఇలా వరుసగా పలు సినిమాల్లో పాత్రలు చేస్తూ కొనసాగారు. అలానే కెరీర్ తొలినాళ్లలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి ఆడియన్స్ నుండి పేరు దక్కించుకున్న చిరంజీవి, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా భారీ సక్సెస్ ద్వారా తొలిసారిగా హీరోగా పెద్ద బ్రేక్ ని అందుకున్నారు. ఇక అక్కడి నుండి హీరోగా ఎన్నో ఛాన్స్ లతో కొనసాగిన చిరంజీవి, ఇటీవల రాజకీయాల్లో చేరారు, అయితే కొన్నేళ్ల అనంతరం రాజకీయాలను ప్రక్కన పెట్టి ఇటీవల మళ్ళి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. ఆ మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆచార్య.


ఇక మొదటి నుండి కూడా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఎంతో ఒదిగిపోయే మంచి మనస్తత్వం కలిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఎందరో నటీనటులకు ప్రత్యేక గౌరవం. అలానే ఆయన హీరోగా మంచి క్రేజ్, పాపులారిటీ తో దూసుకెళ్తున్న రోజుల్లో పలువురు ఇతర భాషల హీరోలు సైతం ఆయన టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోయేవారట. ఆ విధంగా కన్నడలో ప్రఖ్యాత నటుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు కూడా మెగాస్టార్ అంటే ఎంతో ప్రత్యేక అభిమానం. గతంలో పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం, మంచితనం పై రాజ్ కుమార్ మాట్లాడడం కూడా జరిగింది.

అయితే అసలు విషయం ఏమిటంటే, నేడు రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేసారు. అన్నవారు చెప్పిన ఎన్నో గొప్ప విషయాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎంత గొప్ప స్టేటస్, పేరు ఉన్నా సింప్లిసిటీ గా వ్యవహరించడం అనేది ఆయన వంటి చాలా తక్కువమందికే సాధ్యం. ఆ విధంగా నా జీవితంలో ఆయన నుండి నేను ఎంతో నేర్చుకున్నాను, నేడు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, అవును ఆయన నిజంగా బంగారు మనిషి అంటూ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ పెట్టిన ట్వీట్ ని రీట్వీట్ చేసారు మెగాస్టార్.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: