టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సినిమా బద్రి. బాలీవుడ్ నటి అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా 2000వ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. దాని తరువాత దర్శకుడిగా మంచి ఛాన్స్ లు అందుకుంటూ కొనసాగిన పూరి ఆపై పలు భారీ సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. అనంతరం మరొక్కసారి పవన్ హీరోగా కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు అనే మూవీ చేసారు పూరి, అయితే అది పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇక ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎంతో ఎదురు చూసిన పూరి, రెండేళ్ల క్రితం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి దానితో మంచి విజయాన్ని సొంతం చేసుకుని మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. ఇక ప్రస్తుతం యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్న పూరి జగన్నాథ్, త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ చేయనున్నారు అనేది లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

గతంలో పవన్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వీరిద్దరి కాంబో సినిమాని సెట్ చేశారట. కొద్దిరోజుల క్రితం పవన్ కు ఒక అద్భుతమైన స్టోరీ వినిపించిన పూరి, అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని, త్వరలో ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: