టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత తొలిసారిగా టాలీవుడ్ కి ఏ మాయ చేసావే మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు మలయాళంలో కొన్ని యాడ్స్ లో నటించిన సమంతని చూసిన దర్శకడు గౌతమ్ మీనన్, ఏ మాయ చేసావే మూవీకి ఎంపిక చేసారు. నాగచైతన్య హీరోగా నటించిన ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టి, హీరోయిన్ గా సమంతకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుండి వరుసగా అనేక ఛాన్స్ లు అందుకుంటూ కొనసాగిన సమంత, కెరీర్ పరంగా ఎన్నో సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మంచి స్టార్ నటిగా పేరు అందుకున్నారు.

ఇక ఆ తరువాత తన తొలి చిత్ర నటుడు నాగ చైతన్య ని ఇటీవల ప్రేమించి మనసు ఇచ్చి పుచ్చుకున్న సమంత, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంగా ఎంతో వైభవంగా ఆయనని పెళ్లి చేసుకున్నారు. ఇక గత నాలుగేళ్లుగా ఎంతో అన్యోన్యంగా వారిద్దరి దాంపత్యం సాగుతుండగా ఇటీవల వారు విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు వెల్లువెత్తాయి. అయితే అవి నిజం కాదని పలువురు సమంత అభిమానులు కొట్టి పారేసాను. కాగా వాటిని నిజం చేస్తూ రెండో రోజుల క్రితం అధికారికంగా తాము విడిపోతున్నట్లు సమంత, చైతన్య ప్రకటించారు. దానితో ప్రతి ఒక్కరు ఎంతో షాక్ కు గురయ్యారు.

నిజానికి వీరిద్దరి ప్రేమకి బీజం తోలి సినిమామాయ చేసావే తోనే పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి ఆటో నగర్ సూర్య, మనం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటిచడం, మధ్యలో ఇద్దరి మధ్య మరింతగా ప్రేమ అనుబంధం పెరగడంతో ఇద్దరూ ఒకరిని మరొకరు ఎంతో అర్ధం చేసుకుని తమ కుటుంబాల వారికి తమ ప్రేమని గురించి చెప్పి పెళ్లికి ఒప్పించారు. అయితే ఆ విధంగా ఎంతో ఇష్టపడి కొన్నేళ్లపాటు ప్రేమించుకుని, ఆపై అర్ధం చేసుకుని వివరం చేసుకున్న ఆ జంట హఠాత్తుగా విడిపోవడంతో పలువురు ప్రేక్షకాభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: