స్టార్ నటి సమంతమాయ చేసావే మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ తీసిన ఈ సినిమాలో జేస్సీ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత, ఆ సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టారు. అంతేకాదు ఆమె కోసమే ఆ సినిమా చూడడానికి అప్పటి యువత థియేటర్స్ బాట పట్టారు అంటే సమంత ఫస్ట్ మూవీ తోనే ఎంతటి క్రేజ్ అందుకుందో అర్ధం చేసుకోవచ్చు.

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాని మంజుల నిర్మించారు. ఆ తరువాత వరుసగా పలు బడా సినిమాల ఛాన్స్ లు అందుకుని తద్వారా మరిన్ని విజయాలు సొంతం చేసుకున్న సమంత, ఆపైన అటు తమిళ్ లో కూడా స్టార్ నటుల సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక నాలుగేళ్ళ క్రితం ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, చైతన్యల జంట అప్పటి నుండి ఎంతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. అయితే హఠాత్తుగా ఏమి జరిగిందో ఏమో కారణాలు తెలియరానప్పటికీ వీరు ఇరువురూ విడిపోతున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా పుకార్లు రేపడంతో ఒక్కసారిగా సమంత, చైతన్య ఫ్యాన్స్ అవాక్కయ్యారు. అటువంటిది ఏమి లేదని అవి గాలి వార్తలు మాత్రమే అని వారు భావించారు. కాగా ఫైనల్ గా తాము విడాకులు తీసుకోవాలని నిర్ణయించినట్లు రెండో రోజులు క్రితం సమంత, చైతన్య అధికారికంగా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

అయితే వీరిద్దరి విడాకులకి ముఖ్య కారణం ఈగో సమస్యలే అనేది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్. తనకు సంబందించిన పలు విషయాల్లో చైతన్య కలుగచేసుకోవడం తనకు నచ్చడం లేదని పలు మార్లు సమంత తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారని, అలానే చైతన్యకి కూడా కొన్ని విషయాల్లో సమంత ప్రవర్తన నచ్చడం లేదని, ఆ విధంగా ఒకరిపై మరొకరికి ఆధిపత్యం కలిగించాలనే ఈగో సమస్యలే మరింతగా ముదిరి వారిద్దరి విడాకులకి దారి తీసాయని పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదని పలువురు సమంత, చైతన్య అభిమానులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: